Wednesday, 25 June 2025 07:31:02 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కాదు... ఆలస్యానికి కారణాలు ఇవే!

Date : 17 August 2024 11:57 AM Views : 128

Studio18 News - జాతీయం / : లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు జమ్మూకశ్మీర్ తో పాటు హర్యానా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని రాజకీయ పార్టీలు భావించాయి. ఆ విధంగా ప్రచారం కూడా సాగింది. అయితే సీఈసీ రాజీవ్ కుమార్ ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదంటే ..? జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదనే అంశంపై సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నందు వల్ల ఓటరు జాబితా పబ్లికేషన్ ఆలస్యం అయిందనీ ఆయన పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలో ప్రస్తుతం పితృపక్షం, దీపావళి, గణేశ్ చతుర్ధి వంటి ముఖ్యమైన పండుగలు, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, కావున ఈ కారణాల రీత్యా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గతంలో హర్యానాతో పాటుగా మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే అప్పుడు జమ్మూకశ్మీర్ కి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలు జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎన్నికల సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు మాత్రమే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రాలకు శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకూ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్ధవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :