Wednesday, 16 July 2025 11:01:45 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులతో పాటు వారూ భారీ మూల్యం చెల్లించుకున్నారు: నరేంద్ర మోదీ

Date : 31 May 2025 03:43 PM Views : 37

Studio18 News - జాతీయం / : పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'లో భారత నారీశక్తి కీలక పాత్ర పోషించిందని, ఈ చర్య ద్వారా ఉగ్రవాదులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్‌లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని ఆయన ప్రశంసించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం భోపాల్‌లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్‌’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా ఉగ్రవాదులే కాకుండా, వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారతీయ మహిళల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా చూసిందని ఆయన గుర్తుచేశారు. 'ఆపరేషన్ సిందూర్‌' అనంతరం, భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ దాడులు జరిపినప్పుడు, అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని బీఎస్‌ఎఫ్ మహిళా బృందం అఖ్నూర్‌లోని ఫార్వర్డ్ పోస్టుల వద్ద మూడు రోజుల పాటు వీరోచితంగా పోరాడిందని ప్రధాని కొనియాడారు. ‘‘మన సంప్రదాయంలో 'సిందూర్‌' 'నారీశక్తి'కి చిహ్నం. పహల్గామ్‌లో, ఉగ్రవాదులు కేవలం మన పౌరుల రక్తం మాత్రమే చూడలేదు, మన సంస్కృతిపై దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలిట, వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారింది. పాకిస్థాన్‌ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై మన సాయుధ దళాలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్‌ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం’’ అని వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :