Monday, 23 June 2025 03:12:08 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

priyank Kharge: బీజేపీ, జేడీఎస్ నేతలు వచ్చే 6 నెలల్లో జైలుకే!

Date : 11 August 2024 03:05 PM Views : 229

Studio18 News - జాతీయం / : బీజేపీ పాలనలో కర్ణాటకలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నామని ఆ రాష్ట్ర ఐటీబీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లు జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. బీజేపీ, జేడీఎస్ నేతలు సగం మంది జైలులో, మిగతా సగం మంది బెయిలుపై ఉంటారని అన్నారు. ఈమేరకు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. వాటిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని వివరించారు. ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ అధికారులు మధ్యంతర నివేదికలు సమర్పించారని చెప్పారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా అస్థిర పరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తమ పార్టీ నేతలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన గవర్నర్‌.. మాజీ మంత్రి మురుగేశ్ నిరాణిపై ఫిర్యాదు చేస్తే మాత్రం సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. గవర్నర్‌కు ఎక్కడి నుంచో సూచనలు అందుతున్నాయని, వాటి ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే గవర్నర్లను కోర్టులు మందలించే స్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :