Wednesday, 16 July 2025 11:06:11 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

railway board: అడ్వాన్స్ బుకింగ్ గడువు తగ్గించడంపై రైల్వే శాఖ వివరణ

Date : 18 October 2024 11:58 AM Views : 123

Studio18 News - జాతీయం / : రైల్వేలో ముందస్తు బెర్తులు రిజర్వు చేసుకోవడానికి ఇప్పటి వరకూ ఉన్న 120 రోజుల గరిష్ఠ గడువును 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకొంది. నవంబర్ 1 నుండి ఇది అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో గడువు తగ్గింపు నిర్ణయంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. 120 రోజులు గడువు ఉండటం వల్ల క్యాన్సలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రస్తుతం 21 శాతంగా ఉంటోందని పేర్కొంది. నాలుగు నుంచి అయిదు శాతం మంది ప్రయాణమే చేయడం లేదని తెలిపింది. వారు టికెట్ రద్దు చేసుకోకపోవడంతో సీట్లు/బెర్తులు వృథాగా పోతున్నాయి. అంతే కాకుండా పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవడం వంటి ఘటనలకు కారణమవుతోందని పేర్కొంది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందుగానే సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటోందని వెల్లడించింది. ప్రస్తుత నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చని రైల్వే బోర్డు వెల్లడించింది. తక్కువ గడువు ఉంటే నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖకు వీలుగా ఉంటుందని తెలిపింది. ముందస్తు బుకింగ్‌‌కు 60 రోజుల గడువు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :