Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. (Indo-Pak Tensions) సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సీనియర్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. దేశంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను ఆయన సమీక్షించారు. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, ఆరోగ్య సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వివరించారు. కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పర్యాటకులతో సహా 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులను భారత్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. సైనిక దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ పాల్పడుతున్న దాడులను భారత్ తిప్పికొడుతున్నది.
Admin
Studio18 News