Saturday, 24 January 2026 09:00:27 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

గిగ్ వర్కర్ల హక్కులకు కాంగ్రెస్ పెద్దపీట: కర్ణాటక ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Date : 29 May 2025 12:27 PM Views : 344

Studio18 News - జాతీయం / : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల (ఆన్‌లైన్ వేదికల ద్వారా పనిచేసేవారు) హక్కులు, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ కార్మికులు తనతో పంచుకున్న ఆవేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. "మాకు రేటింగ్ కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే కానీ, బానిసలం కాదు" అని వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తన మదిలో బలంగా నాటుకుపోయాయని రాహుల్ గాంధీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల హక్కులు, గౌరవం, భద్రతకు హామీ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం చారిత్రాత్మక ముందడుగు అని రాహుల్ ప్రశంసించారు. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని గిగ్ కార్మికులు మనకు ఆహారం, నిత్యావసర వస్తువులు చేరవేస్తారని ఆయన అన్నారు. అయినప్పటికీ, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎలాంటి వివరణ లేకుండా యాప్‌ల నుంచి వారిని బ్లాక్ చేయడం, అనారోగ్యానికి గురైతే సెలవులు కూడా మంజూరు కాకపోవడం, వారికి చెల్లించే మొత్తాలు పారదర్శకత లేని అల్గోరిథమ్‌ల ద్వారా నిర్ణయించబడటం వంటివి గిగ్ వర్కర్ల ప్రధాన సమస్యలని ఆయన వివరించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ ఈ పరిస్థితులను మార్చనుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, న్యాయమైన ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో అల్గోరిథమిక్ పారదర్శకత, ఏకపక్షంగా యాప్‌ల నుంచి తొలగించకుండా రక్షణ వంటివి లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేసేదిగా ఉండాలని, ఈ విషయంలో రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలిచాయని రాహుల్ అన్నారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనిస్తుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత పనులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, అవి పని సంబంధాలను పునర్నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల హక్కులే కేంద్రంగా ఈ వ్యవస్థలు ఉండాలని, ఈ విధానాన్ని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :