Sunday, 08 March 2026 09:27:17 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

మోదీ ప్రసంగం సరికొత్త భారతానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

Date : 13 May 2025 12:00 PM Views : 383

Studio18 News - జాతీయం / : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం భారతదేశపు నూతన సిద్ధాంతాన్ని ఆవిష్కరించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి భారతదేశ బలాన్ని స్పష్టం చేసిందని అన్నారు. ప్రధాని కేవలం ప్రసంగించడమే కాకుండా దేశానికి ఒక నూతన మార్గనిర్దేశం చేశారని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బుద్ధ పూర్ణిమ నాడు శాంతి మార్గాన్ని స్మరించుకుంటామని, అయితే చరిత్ర బోధించినట్లుగా బలంతోనే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. "మనం శాంతి మార్గంలో పయనిస్తాం, కానీ ఉగ్రవాదం పట్ల మాత్రం జీరో టాలరెన్స్ పాటిస్తాం" అని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ, దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, ఆయుధాలను విజయవంతంగా ఉపయోగించి సరిహద్దు ఆవలి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని అన్నారు. ఈ ‘మేడిన్ ఇండియా’ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చాటిందని, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో స్పందించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం శాంతియుత మార్గంలో, అపారమైన శక్తిసామర్థ్యాలతో, అచంచలమైన లక్ష్యంతో నిలబడిందని చంద్రబాబు అన్నారు. భారతీయులుగా మనం ఐక్యంగా ఉంటూ, ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగంపై పవన్ కల్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రధాని ప్రసంగంపై స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ప్రధాని మోదీ యావత్ భారతానికి, అంతర్జాతీయ సమాజానికి అత్యంత శక్తివంతమైన సందేశం ఇచ్చారని ఆయన కొనియాడారు. "ఉగ్రవాదం-చర్చలు కలిసి సాగవు, ఉగ్రవాదం-వాణిజ్యం కలిసి సాగవు, రక్తం-నీరు కలిసి ప్రవహించవు" అన్న ప్రధాని వ్యాఖ్యలను పవన్ తన ప్రకటనలో ఉటంకించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :