Wednesday, 25 June 2025 07:01:19 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

మీ సిమ్‌ బ్లాక్‌ అవుతుందంటూ మోసం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు నకిలీ కేవైసీ హెచ్చరిక

Date : 09 June 2025 08:12 PM Views : 38

Studio18 News - జాతీయం / : సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మీ కస్టమర్‌ అకౌంట్‌ (కేవైసీ)ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నిలిపివేసిందని, 24 గంటల్లోగా మీ సిమ్‌ కార్డు బ్లాక్‌ అవుతుందంటూ తప్పుడు సందేశాలు పంపిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మోసగాళ్లు పంపుతున్న ఈ నకిలీ సందేశంలో, సమస్యను పరిష్కరించుకోవడానికి వెంటనే ఒక నిర్దిష్ట ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా అమాయకుల నుంచి వ్యక్తిగత సమాచారం తస్కరించి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడమే ఈ కేటుగాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ తరహా మోసపూరిత సందేశాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం దీనిపై స్పష్టతనిచ్చింది. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరుతో వస్తున్న ఈ సందేశం పూర్తిగా నకిలీది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సిమ్‌ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసులను వినియోగదారులకు పంపించదు. ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం 'ఎక్స్‌' వేదికగా స్పష్టం చేసింది. ఏదైనా వార్తను లేదా సందేశాన్ని గుడ్డిగా నమ్మవద్దని, ఇతరులకు షేర్‌ చేసే ముందు దాని యదార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులు లేదా ఫోన్‌ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైనా అనుమానం వస్తే, వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :