Wednesday, 25 June 2025 07:03:39 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్

Date : 12 May 2025 06:35 PM Views : 52

Studio18 News - జాతీయం / : 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌లోని అణు నిల్వ కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. కిరానా హిల్స్ వద్ద ఉన్న పాక్ అణు స్థావరంపై భారత్ దాడి చేసిందంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించేందుకు త్రివిధ దళాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఊహాగానాలపై ఆయన స్పష్టతనిచ్చారు. పాకిస్థాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేస్తున్నాయని భావిస్తున్న కిరానా హిల్స్‌పై దాడి చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ, పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్‌లో నిల్వ ఉంచుతుందని సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వాటి గురించి ఇప్పటిదాకా తమకు తెలియదని అన్నారు. ‘‘అక్కడ ఏమున్నా సరే.. మేం మాత్రం ఆ కొండలను లక్ష్యంగా చేసుకోలేదు. మా టార్గెట్ లిస్ట్‌లో ఆ ప్రాంతం లేదు’’ అని ఎయిర్‌ చీఫ్ మార్షల్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి, పాకిస్థాన్‌లోని సర్గోధా వైమానిక స్థావరం సమీపంలో ఉన్న కిరానా హిల్స్‌లోని అణు నిల్వలపై భారత్ దాడి చేసి ఉండవచ్చని అనేక వార్తలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సర్గోధా వైమానిక స్థావరంపై దాడి జరిగినట్లు భారత సైన్యం ధృవీకరించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల పాకిస్థాన్‌లో సంభవించిన భూకంపాలకు, ఈ దాడికి సంబంధం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ వదంతులన్నింటికీ ఏకే భారతి తన ప్రకటనతో తెరదించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :