Studio18 News - క్రీడలు / HYDERABAD : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంతో భారత్ అత్యధిక టీ20 ప్రపంచకప్లు గెలిచిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించడం ద్వారా ఈ అరుదైన ఘనతను అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచకప్లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని పొట్టి ఫార్మాట్లో అత్యధిక వరల్డ్కప్ టైటిళ్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అనంతరం చాలా సంవత్సరాల పాటు కప్ కలగానే మిగిలింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో మరోసారి భారత్ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో మూడోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని భారత జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు రెండేసి సార్లు టైటిళ్లు గెలుచుకున్నాయి. ఇంగ్లాండ్ 2010, 2022 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకోగా, వెస్టిండీస్ 2012, 2016లో విజేతగా నిలిచింది. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి టైటిల్ను సొంతం చేసుకున్నాయి. పాకిస్థాన్ 2009లో విజేతగా నిలిచింది. శ్రీలంక 2014లో ట్రోఫీని అందుకోగా, ఆస్ట్రేలియా 2021లో టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచి తన సత్తాను ప్రపంచానికి చాటిం
Admin
Studio18 News