Thursday, 22 May 2025 03:16:42 PM
# చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు

Pune Test: పూణే టెస్టులో టాస్ పడింది.. భారత జట్టులో మూడు మార్పులు

Date : 24 October 2024 01:46 PM Views : 113

Studio18 News - క్రీడలు / : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కీలకమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. జట్టులో మూడు మార్పులు చేశామని కెప్టెన్ రోహిత్ వెల్లడించారు. పేసర్ మహ్మద్ సిరాజ్, మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టి పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. మాట్ హెన్రీ స్థానంలో సాంట్నర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. తుది జట్లు ఇవే.. భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే. రోహిత్ ఏమన్నాడంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. ‘‘తొలి టెస్టులో మొదటి సెషన్ మాకు సానుకూలంగా సాగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మేము బాగానే పుంజుకొని బ్యాటింగ్ చేశాం. దాని నుంచి చాలా సానుకూల అంశాలను నేర్చుకున్నాం. ఆ విషయాలను ఈ మ్యాచ్‌లో ఏ విధంగా ఉపయోగించుకోగలమో చూడాలి. సిరీస్‌లో వెనుకబడి ఉన్నప్పుడు తిరిగి పుంజుకోవడానికి మార్గాలను అన్వేషిస్తుంటారు. మేము కూడా అదే చేస్తాం. ఇక పిచ్ కొంచెం పొడిగా అనిపిస్తోంది. తొలి 10 ఓవర్లు ఎంత కీలకంగా మారతాయో చూడాలి’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :