Sunday, 07 December 2025 10:03:57 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటన.. కీలక నిర్ణయం తీసుకున్న సస్పెండైన అధికారి!

Date : 09 June 2025 08:34 PM Views : 165

Studio18 News - క్రీడలు / : చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ సవాలు చేస్తూ సోమవారం బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వికాస్ కుమార్ బెంగళూరు నగర పశ్చిమ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ మరియు అదనపు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లకు ఆయనే ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ తొక్కిసలాట దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. "జూన్ 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం" అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం, కింది స్థాయి అధికారులు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతోంది" అని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో వికాస్ కుమార్ కూడా ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :