Studio18 News - క్రీడలు / : మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా నేడు శ్రీలంక బయల్దేరింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టు వెంట పయనమయ్యాడు. టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నేడు ప్రత్యేక విమానంలో శ్రీలంక తరలి వెళ్లారు. టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియగా, ద్రావిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్ గా గంభీర్ నియమితుడయ్యాడు. టీమిండియా కోచ్ గా గంభీర్ ప్రస్థానం శ్రీలంక టూర్ తో ప్రారంభం కానుంది. శ్రీలంకతో టీమిండియా ఈ నెల 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండగా, వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
Admin
Studio18 News