Tuesday, 10 March 2026 04:12:23 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

R Sridhar: శ్రీలంక జట్టుకు టీమిండియా మాజీ కోచ్.. ఆర్. శ్రీధర్‌కు కీలక బాధ్యతలు

Date : 17 December 2025 07:28 PM Views : 117

Studio18 News - క్రీడలు / : శ్రీలంక క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ నియామకం 2026 టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు కొనసాగనున్న ఒప్పందం గతంలో ఏడేళ్ల పాటు భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన శ్రీధర్ లంక ఆటగాళ్ల సహజ ప్రతిభను ప్రోత్సహిస్తానన్న కొత్త కోచ్ భారత క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) తమ జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ ను నియమించింది. 2026లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. శ్రీధర్ నియామకం ఈ నెల 11 నుంచి అమల్లోకి రాగా, 2026 మార్చి 10న అతడి ఒప్పందం ముగుస్తుంది. బీసీసీఐ లెవల్ 3 కోచ్ అయిన శ్రీధర్‌కు అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉంది. 2014 నుంచి 2021 వరకు ఏడేళ్ల పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు సేవలందించాడు. అతడి హయాంలో భారత జట్టు రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది. ఈ నియామకంపై శ్రీధర్ స్పందిస్తూ.. "శ్రీలంక ఆటగాళ్లు సహజమైన ప్రతిభ, పోరాట స్ఫూర్తికి ప్రసిద్ధి. నా పద్ధతులను వారిపై రుద్దకుండా, వారిలో అథ్లెటిసిజం, అవగాహన సహజంగా వృద్ధి చెందే వాతావరణాన్ని కల్పిస్తాను. ఆటగాళ్ల మధ్య సమన్వయం పెంచి, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇస్తాను" అని తెలిపాడు. రాబోయే పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు టీ20 ప్రపంచకప్‌నకు శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంపై శ్రీధర్ దృష్టి సారించనున్నాడు. కాగా, ఈ ఏడాది మే నెలలోనే అతడు శ్రీలంక హై పర్ఫార్మెన్స్ సెంటర్‌లో 10 రోజుల పాటు ప్రత్యేక ఫీల్డింగ్ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం గమనార్హం. గతంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :