Thursday, 22 May 2025 02:25:19 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలంపై రిషబ్ పంత్ కీలక నిర్ణయం?.. తెరపైకి ఆసక్తికర కథనం

Date : 24 October 2024 02:07 PM Views : 103

Studio18 News - క్రీడలు / : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వీడాలనుకుంటున్నాడా? అంటే ఔననే అంటున్నాయి కథనాలు. ఐపీఎల్ మెగా వేలం 2025లోకి ప్రవేశించాలని పంత్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్ మొత్తం ఢిల్లీ ఫ్రాంచైజీకి మాత్రమే ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఇక జట్టును వీడాలని భావిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. మెగా వేలంలోకి పంత్ ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అతడిపై పలు ఫ్రాంచైజీలు దృష్టిసారించాయని, ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా కెప్టెన్‌గా పంత్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నాయని తెలిపింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఈ మధ్య మాట్లాడుతూ.. రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లలో రిషబ్ పంత్ తప్పుకుండా ఉంటాడని అన్నారు. తమ జట్టులో ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, ఎవరెవర్ని నిలుపుదల చేసుకోవాలనే దానిపై జీఎంఆర్, తమ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పార్థ్ జిందాల్ చెప్పారు. కానీ తాజా కథనాలను చూస్తుంటే పంత్ ఆ జట్టులో కొనసాగడం సందేహమే అనిపిస్తోంది. ఇప్పటికే కోచింగ్ సిబ్బంది నుంచి రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ నిష్క్రమించారు. ఇక పంత్ కూడా లేకుంటే జట్టులో కీలక మార్పులు జరగడం ఖాయం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :