Friday, 14 February 2025 08:37:33 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

IND vs SL: భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్‌.. ఏకంగా ఇద్ద‌రు..

Date : 01 August 2024 04:20 PM Views : 56

Studio18 News - క్రీడలు / : India vs Srilanka : టీమ్ఇండియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌ ను 3-0 తేడాతో ఓడిపోయిన శ్రీలంక, క‌నీసం వ‌న్డే సిరీస్‌లోనైనా స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అయితే.. భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్లు దిల్షాన్ మ‌ధుశంక‌, మ‌తీషా ప‌తిర‌ణ గాయాల‌తో వ‌న్డే సిరీస్‌కు దూరం అయిన‌ట్లుగా స్థానిక మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌ట్టు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే స‌మ‌యంలో మ‌ధుశంక ఎడమ కాలికి గాయమైంది. మ‌రో వైపు భార‌త్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో బంతిని ఆపే క్ర‌మంలో ప‌తిరాన భుజానికి గాయ‌మైంది. వైద్యులు అత‌డికి రెండు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు. దీంతో భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు వీరిద్ద‌రు దూరం అయిన‌ట్లుగా లంక క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి స్థానాల్లో ఎషాన్ మ‌లింగ‌, మ‌హ్మ‌ద్ షిరాజ్‌ల‌కు తీసుకున్న‌ట్లుగా తెలిపింది. స్టాండ్ బైలుగా కుశాల్ జ‌నిత్‌, జెఫ్రీ వాండ‌ర్సే, ప్ర‌మోద్ మ‌ధుష‌న్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది. టీమ్ఇండియాతో లంక జ‌ట్టు మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆగ‌స్టు 2 నుంచి వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగ‌స్టు 2, 4, 7 తేదీల్లో మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు వ‌న్డేలు కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు : చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్‌, అసిత ఫెర్నాండో.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :