Friday, 13 June 2025 03:38:22 AM
# ట్రైనీ డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం... ఘటన స్థలంలో అందినకాడికి దోపిడీలు! # కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ # ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌ # కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం! # జర్నలిస్టు కృష్ణంరాజుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు # కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...? # అహ్మదాబాద్ విమాన దుర్ఘటన... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడిన ప్రధాని మోదీ # ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ # అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి # రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయిన రఘురామ... కూల్చివేతకు ఆదేశాలు! # పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ! # రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి # 'తల్లికి వందనం' నిధులు నేడే విడుదల.. 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి # బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి # ఏఎంఏ అధ్యక్షుడిగా మన తెలుగు వైద్యుడు.. అమెరికా వైద్య చరిత్రలో నూతన అధ్యాయం! # ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి # కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం # తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ # విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు # యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు

Womens T20 World cup 2024 : ఏందిరా అయ్యా.. ఐసీసీ మెగా టోర్నీనా, దేశ‌వాలీనా.. తొలి రోజే 13 మ్యాచులు మిస్‌..

Date : 04 October 2024 05:36 PM Views : 111

Studio18 News - క్రీడలు / : యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గురువారం ప్రారంభ‌మైంది. పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్లు బోణీ కొట్టాయి. ఈ మ్యాచుల్లో బౌల‌ర్ల హ‌వా క‌నిపించ‌డంతో లోస్కోర్లు న‌మోదు అయ్యాయి. కాగా.. రెండు మ్యాచుల్లో నాలుగు దేశాల ప్లేయ‌ర్లు క‌లిపి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 13 మ్యాచుల‌ను జార‌విడిచారు. ఏదో దేశ‌వాలీ టోర్నీలో ఇలా జ‌రిగితే పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు గానీ ఐసీసీ మెగా టోర్నీలో ఇలా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. క్రికెట్ లో ఒక్క క్యాచ్ మిస్ చేస్తేనే దాని ఫ‌లితం మ్యాచ్ పై ప‌డిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇన్ని క్యాచులు మిస్ అయ్యాయి అంటే దాని ఎఫెక్ట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది ఐసీసీ మెగా టోర్నీయేనా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ మ్యాచులో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచులో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయ‌గా బంగ్లా ఫీల్డ‌ర్లు నాలుగు క్యాచ్‌ల‌ను మిస్ చేశారు. ఇక ఆ త‌రువాత స్కాట్లాండ్ ప్లేయ‌ర్లు తామేమీ త‌క్కువ కాద‌న్న‌ట్లు మూడు క్యాచుల‌ను నేల‌పాలు చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఆ త‌రువాత శ్రీలంక‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు మూడేసి చొప్పున క్యాచుల‌ను మిస్ చేశాయి. ఈ మ్యాచ్‌లో 31 ప‌రుగుల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :