Sunday, 25 January 2026 05:53:19 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

గవర్నర్‌ను ఎవరు ఆహ్వానించారో తెలియదు: ఆర్సీబీ సన్మాన కార్యక్రమంపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Date : 09 June 2025 08:20 PM Views : 282

Studio18 News - క్రీడలు / : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్ల సన్మాన కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అవమానం జరిగిందన్న ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. జూన్ 4న విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఎవరు ఆహ్వానించారో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల కోసం గవర్నర్‌ను వేదికపై నిరీక్షింపజేశారని, కాంగ్రెస్ నేతలు ఆటగాళ్లతో సెల్ఫీలు దిగుతూ ఆయన్ను పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శివకుమార్, "గవర్నర్‌ను ఎవరు పిలిచారో ఆయన్నే అడగాలి. నాకేమీ తెలియదు. ఈ విషయంపై ఏకసభ్య విచారణ కమిషన్ దర్యాప్తు చేస్తోంది, నా వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేయకూడదు" అని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిశారా అన్న ప్రశ్నకు, ఈసారి అధిష్ఠాన నేతలను కలవడం సాధ్యపడలేదని బదులిచ్చారు. "జూన్ 18న కృష్ణా నదీ జలాల పంపిణీ అవార్డు విషయమై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం ఉంది, అందుకోసం ఢిల్లీ వస్తాను. ప్రధానమంత్రిని కూడా కలవాలని ఆలోచిస్తున్నాం" అని తెలిపారు. "ఈరోజు యెట్టినహొళె తాగునీటి ప్రాజెక్టుపై సమావేశానికి హాజరయ్యేందుకు కర్ణాటకకు తిరిగి వెళ్లాలి" అని ఆయన వివరించారు. సిద్ధరామయ్యపై కుమారస్వామి విమర్శలు ఇదిలా ఉండగా, ఆర్సీబీ సన్మాన కార్యక్రమం జరిగిన విధాన సౌధ వద్ద ఏమీ జరగలేదని, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలోనే 11 మంది మరణించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎంపై విరుచుకుపడ్డారు. "గౌరవనీయులైన సిద్ధరామయ్య గారూ.. మీరు కర్ణాటక ముఖ్యమంత్రా లేక విధాన సౌధ మెట్ల ముఖ్యమంత్రా!? దయచేసి చెప్పండి?" అని ప్రశ్నించారు. "కేవలం పోలీసులపై నెపం నెట్టి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే కుట్ర ఎందుకు?" అంటూ సీఎం సిద్ధరామయ్యను కుమారస్వామి విమర్శించారు. డీకే సురేష్ కౌంటర్ కేంద్ర మంత్రి కుమారస్వామి విమర్శలపై డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ ఘాటుగా స్పందించారు. "ఆర్సీబీ గెలిచిన తర్వాత, జట్టుకు ఊరేగింపు నిర్వహించాలని బీజేపీ, జేడీఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఈరోజు వారు మాట మార్చారు. బీజేపీ యూటర్న్ తీసుకోవడం కొత్తేమీ కాదు" అని అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందిస్తూ, "రెండు పార్టీలూ ఊరేగింపు కావాలని డిమాండ్ చేశాయి. 'మీరు క్రీడాభిమానులను అవమానిస్తున్నారా, ఊరేగింపు నిర్వహించలేరా?' అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి ఇదే ధోరణి. ప్రజలు వారికి మెజారిటీ ఇవ్వలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఘోర విషాదాల జాబితాను మేం అందిస్తాం. బీజేపీ నేతలకు ఏమాత్రం నైతికత ఉన్నా, వారే ముందుగా రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :