Thursday, 15 May 2025 03:25:29 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Mitchell Starc: ఐపీఎల్ వేలంలో రికార్డును బద్దలు కొట్టబోయే ముగ్గురు భారత క్రికెటర్లు వీరేనా?

Date : 28 August 2024 12:15 PM Views : 850

Studio18 News - క్రీడలు / : ఐపీఎల్ 2025 సీజన్‌ ఆరంభానికి చాలా సమయం ఉంది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన సందడి మొదలైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత తిరిగి మరోసారి జరగనున్న ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. భవిష్యత్తు జట్టును సిద్ధం చేసేందుకు యాజమాన్యాలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. బీసీసీఐ నిబంధనలు, ఏయే ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవాలనే అంశాలపై యాజమాన్యాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మెగా వేలం నిర్వహించడం సరికాదంటూ కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వేలం జరగడం ఖాయమైంది. దీంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఎవరు నిలవనున్నారు? ఎవరు ఏ జట్టుకు ఆడబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఏకంగా రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని దక్కించుకుంది. మరి ఈ రికార్డు మెగా వేలంలో బద్దలు కానుందా? స్టార్క్ రికార్డును భారతీయ క్రికెటర్లు ఎవరైనా బద్దలు కొట్టనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న ముగ్గురు భారతీయ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మయాంక్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో ఫ్రాంచైజీని వీడవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు ఉన్నాయి. ఇక వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్ను వేసే సూచనలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంత్ మంచి ఫామ్‌లో ఉండడమే దీనికి కారణంగా ఉంది. గత ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచ కప్ 2024లో కూడా అతడు రాణించాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ కు కూడా భారీ ధర పలుకొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో అతడు ఏకంగా 156.7 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :