Tuesday, 10 March 2026 04:12:22 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

BCCI | త్వరలోనే టీమిండియాకు కొత్త కోచ్‌.. ఆ సొగసరి ఆటగాడికే ఓటేస్తారా..!

BCCI : దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడడంతో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క

Date : 27 December 2025 08:17 PM Views : 225

Studio18 News - క్రీడలు / : BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27ను సిరీస్ సమంతో ఆరంభించిన భారత్ అనూహ్యంగా తడబడుతోంది. స్వదేశంలో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన శుభ్‌మన్ గిల్ సేన.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచుల్లో ఓటమితో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్న గౌతీ బదులు సుదీర్ఘ ఫార్మాట్‌లో అనుభవజ్ఞుడైన వీవీఎస్ లక్ష్మణ్‌(VVS Laxman)కు బాధ్యతలు అప్పగిస్తారని కథనాలు వస్తున్నాయి. సఫారీల దెబ్బకు రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత బీసీసీఐ పెద్దలు మాజీ సొగసరి బ్యాటర్‌ను సంప్రదించారని సమాచారం. సొంతగడ్డపై సింహంలా గర్జించే భారత జట్టు గంభీర్ కోచింగ్‌లో విఫలమవుతోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌ను మరుకవ ముందే దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ కొల్లగొట్టింది. ఒకప్పుడు అజేయ శక్తిగా దూసుకెళ్లిన టీమిండియాను గంభీర్ పరాజయాల తోవ తొక్కిండానే విమర్శలు వచ్చాయి. దాంతో.. గౌతీని వైట్‌బాల్‌కే పరిమితం చేసి టెస్టులకు కొత్త కోచ్‌ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మాజీ టెస్టు స్పెషలిస్ట్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించిందని టాక్.

అయితే.. అతడు మాత్రం బెంగళూరలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌(CoE)కు హెడ్‌గా ఉండేందుకే ఇష్ట పడుతున్నాట. అయినా సరే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనను బట్టి గంభీర్‌ను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తామని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసక్తి చూపకపోవడంతోనే ‘ప్రస్తుతం గంభీర్‌కు అన్నివిధాల మద్దతు లభిస్తోంది. కోచ్‌గా అతడి కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్‌ వరకూ ఉంది. అయితే.. వచ్చే టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా నిలబెట్టుకున్నా.. ఫైనల్ చేరినా గంభీర్‌కు ఢోకా లేదు. అలా జరగలేదంటే గంభీర్ కోచింగ్ కాంట్రాక్ట్‌ను సమీక్షించే అవకాశముంది. టెస్ట్‌ కోచ్‌గా గౌతీ కొనసాగుతాడా? లేదా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే… లక్ష్మణ్‌ సహా కొందరు ఆసక్తి చూపకపోవడంతోనే అతడు రెడ్ బాల్ కోచ్‌గా ఇంకా ఉన్నాడు’ అని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :