Monday, 17 February 2025 03:34:26 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Paris Olympics 2024 : నిఖ‌త్ జ‌రీన్ ప‌త‌క ఆశ‌లు ఆవిరి.. ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ముగిసిన తెలంగాణ బాక్స‌ర్ జ‌ర్నీ..

Date : 01 August 2024 04:45 PM Views : 103

Studio18 News - క్రీడలు / : Paris Olympics 2024 – Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో ప‌త‌క‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగింది స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌. అయితే.. ఆమె జ‌ర్నీ ప్రిక్వార్టర్స్‌తోనే ముగిసింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రిక్వార్ట‌ర్స్‌లో చైనా బాక్స‌ర్ వు హు చేతిలో ఓట‌మి పాలైంది. గురువారం టాప్ సీడ్ చైనా బాక్స‌ర్ వు హు 5-0 తేడాతో నిఖ‌త్ జ‌రీన్ పై విజ‌యం సాధించింది. దీంతో నిఖత్ ప‌త‌క ఆశ‌లు ఆవిరి అయిపోయాయి. ఇక బాక్సింగ్‌లో పతక ఆశలు లవ్లీనా, నిశాంత్‌పైనే ఉన్నాయి. తెలంగాణ బిడ్డ అయిన నిఖ‌త్ పై ప్ర‌త్య‌ర్థి ఆది నుంచే పంచ్‌ల‌తో విరుచుకుప‌డింది. దీంతో తొలి రౌండ్‌ను నిఖ‌త్ 49-46తో చేజార్చుకుంది. ఇక రెండో రౌండ్‌లో నిఖ‌త్ కాస్త ప్ర‌తిఘ‌టించింది. అయితే.. ఆఖ‌ర‌కు 48-47 తేడాతో కోల్పోయింది. ఇక ఆఖ‌రి రౌండ్‌లో చైనా బాక్స‌ర్ విజృంభించింది. పంచుల‌తో నిఖ‌త్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖ‌త్ ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణి క‌న‌బ‌ర‌చ‌డంతో 45-50తో ఓడిపోయింది. ఇక బాక్సింగ్‌లో ప‌త‌క ఆశ‌లు లోవ్లీనా, నిశాంత్ ల పైనే ఉన్నాయి. వీరిద్ద‌రు క్వార్ట‌ర్ పైన‌ల్‌కు చేరుకున్నారు. ఆగ‌స్టు 4న వీరి మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య మూడుకు చేరాయి. గురువారం పురుషుల 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ విభాగంలో స్వప్నిల్‌ కుశాలె కాంస్య ప‌త‌కం కైవ‌సం చేసుకున్నాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :