Tuesday, 10 March 2026 03:50:21 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

ఇలా తయారయ్యారేంట్రా సామీ.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

నేటి ప్రపంచంలో సోషల్ మీడియా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు.. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, సమయం గడపడానికి ఇది స

Date : 30 October 2025 08:13 PM Views : 151

Studio18 News - తాజా వార్తలు / : నేటి ప్రపంచంలో సోషల్ మీడియా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు.. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, సమయం గడపడానికి ఇది సులభమైన మార్గంగా మారింది. అందుకే ప్రతిరోజూ వందలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు తమ ప్రతిభ ద్వారా ప్రజాదరణ పొందుతారు. మరికొందరు తమ జుగాద్ లోకల్ టాటెంట్ ద్వారా, మరికొందరు విచిత్రమైన చర్యలు, చిలిపి చేష్టలతో దృష్టిని ఆకర్షిస్తారు. అలాంటి ఫన్నీ, కొంచెం వింతైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో చిత్రీకరించిన తీరు, మిమ్మల్ని ఒక్క క్షణం షాక్‌కు గురిచేస్తుంది. కానీ మరుక్షణమే మిమ్మల్ని నవ్విస్తుంది. ఈ వీడియో రోడ్డు పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఇటీవల వర్షం పడింది. మట్టి రోడ్డులో చాలా నీరు పేరుకుపోయింది. బురద నీటిలో కరిగి, దానికి టీ లాంటి రంగు వచ్చింది. సాధారణంగా ప్రజలు అలాంటి నీటిని తాగరు, కానీ ఈ వ్యక్తి మనసులో వేరే ఆలోచనలో ఉన్నాడు. ఒక యువకుడు రెండు కప్పులను తీసుకొని మురికి, బురద నీటితో నింపాడు. రెండు కప్పులు వేడి టీతో నిండి ఉన్నట్లు కవరింగ్ ఇచ్చాడు. చేతిలో కప్పులు తీసుకుని, అతను తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. అతని ముఖంలో ఒక కొంటె చిరునవ్వు కనిపిస్తుంది. కానీ అతని స్నేహితుడికి అతని ఉద్దేశ్యాలను గ్రహించలేకపోయాడు. అతను ఒక కప్పు తన దగ్గర ఉంచుకుని, మరొక కప్పును తన స్నేహితుడికి ఇచ్చి, “ఇదిగో, అన్నయ్య, కొంచెం టీ తాగు. వాతావరణం కూడా చాలా బాగుంది” అని అన్నాడు. అతని స్నేహితుడు ఎమాత్రం ఆలోచించకుండా కప్పును తీసుకున్నాడు. బురద నీరు టీ లాగా కనిపించింది. కాబట్టి అతనికి ఏమీ అనుమానం లేదు. అతను ఒక సిప్ తాగగానే, అతని ముఖ కవళికలు అకస్మాత్తుగా మారిపోయాయి. ఇది టీ కాదు, వేరే ఏదో అని గ్రహించడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. అతను వెంటనే కప్పును కింద పెట్టి, తన నోటిలోకి వెళ్ళిన సిప్‌ను ఉమ్మివేశాడు. మరోవైపు, చిలిపి పని చేసిన స్నేహితుడు బిగ్గరగా నవ్వుతూ అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :