Tuesday, 10 March 2026 03:46:52 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Amaravati : ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం, అప్పులు అలా తీరుస్తాం- మంత్రి నారాయణ

ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.

Date : 25 March 2025 04:35 PM Views : 572

Studio18 News - తాజా వార్తలు / : Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు మంత్రి నారాయణ. ఇవాళ ఆయన అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఐఏఎస్ బంగ్లాలను పరిశీలించారు. అధికారుల కోసం 115 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. సెక్రటరీలకు 90 భవనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25 భవనాలు నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసామన్నారు మంత్రి నారాయణ. రానున్న మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. రాజధాని నిర్మాణం కోసం 31వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. కాగా అమరావతి నిర్మాణానికి ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయము అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాక భూమి అమ్మి అప్పులు తీరుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :