Studio18 News - తాజా వార్తలు / : నిల్వల నుంచి బంగారాన్ని విక్రయించిందని ప్రచారం వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వార్తలను విశ్వసించవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన నిల్వల నుంచి 35 టన్నుల బంగారాన్ని విక్రయించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు పలు వార్తా కథనాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న పోస్టులు అవాస్తవమని స్పష్టం చేసింది. ఆర్బీఐ బంగారాన్ని విక్రయించిందనే వార్తలను విశ్వసించవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ధృవీకరించుకోకుండా ఎవరూ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి అవాస్తవ వార్తలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. ఆర్థికపరమైన ప్రకటనలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో ధృవీకరించుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం తప్పని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం చేసీన ట్వీట్ను ఆర్బీఐ రీట్వీట్ చేసింది.
Admin
Studio18 News