Tuesday, 10 March 2026 03:49:25 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైర‌ల్‌!

నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో 'రాబిన్‌హుడ్' ఈ నెల 28న విడుద‌ల కానున్న సినిమా జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌ నిన్న హైద‌రాబాద్ ప్రీ ర

Date : 24 March 2025 12:15 PM Views : 235

Studio18 News - తాజా వార్తలు / : టాలీవుడ్ యువ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. ఈ నెల 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు ఆసీస్ క్రికెట‌ర్ డేవిడ్‌ వార్నర్ ప్ర‌త్యేక‌ అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్న‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. వేదిక‌పై రాజేంద్ర ప్ర‌సాద్‌ మాట్లాడుతూ... "హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల క‌లిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే.. పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్. నీకు ఇదే నా వార్నింగ్" అని అన్నారు. అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌దాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడ‌ట‌మేంట‌ని వార్న‌ర్ అభిమానులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్ లో వార్న‌ర్ డ్యాన్స్ చేయ‌డంతో పాటు తెలుగులో మాట్లాడి అంద‌రినీ న‌వ్వించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :