Wednesday, 30 April 2025 04:26:54 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..

మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.

Date : 26 March 2025 12:39 PM Views : 128

Studio18 News - తాజా వార్తలు / : తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పథకం కింద సర్కారు డబ్బులు జమచేసింది. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మొత్తం రూ.199.99 కోట్లను అధికారులు జమ చేశారు. 3.33 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు ఇవి. తెలంగాణలోని సుమారు 71 శాతం మంది అన్నదాతలకు రైతు భరోసా సాయం అందింది. ఈ పథకం అమలును షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకు 54.74 లక్షల మంది రైతులకు డబ్బులు అందాయి.

వారి అందరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.4,666.60 కోట్లు వేశారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో సీజన్‌‌కు రూ.6 వేల చొప్పున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు చొప్పున అన్నదాతలకు డబ్బులు వేస్తారు. ఈ నెల చివరిలోగా.. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. తెలంగాణలో 77 లక్షల మంది రైతు భరోసా పొందేందుకు అర్హులు. 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు గరిష్ఠంగా నల్లగొండ జిల్లాకు రూ.335.50 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డికి (రూ.230.06 కోట్లు) ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :