Studio18 News - తాజా వార్తలు / : Gig workers: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతీయేటా రూ.5లక్షల వరకు గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రయోజనాలను వేగంగా అమలు చేసేందుకు కొత్త స్కీంను కేంద్రం త్వరలోనే ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని వర్కర్లకు తాజాగా కేంద్రం సూచించింది.
ఈ-శ్రమ్ పోర్టల్ లో వర్కర్లే స్వయంగా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్లాట్ ఫామ్ అగ్రిగేటర్లు కూడా ఈ సమాచారాన్ని వర్కర్లకు చేరవేయాలని, వారు ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడాలని కోరింది. ఈ-శ్రమ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, వారి పేర్లను నమోదు చేయనున్నట్లు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కోటి మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
Admin
Studio18 News