Tuesday, 10 March 2026 03:49:27 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సీబీఐ రాయ్ పూర్, భిలాయ్ లోని భూపేశ్ భాఘెల్ నివాసాల్లో తనిఖీలు కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొంద

Date : 26 March 2025 12:15 PM Views : 600

Studio18 News - తాజా వార్తలు / : ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో బుధవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్ పూర్, భిలాయ్ లలోని బాఘెల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు బాఘెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా రెయిడ్ చేశారని బాఘెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. బాఘెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సీబీఐ సోదాలు జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీబీఐ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ.. భూపేశ్ బాఘెల్ ను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జిగా బాఘెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాఘెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం.. తాజాగా సీబీఐ అధికారులను బాఘెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే, ఈ దాడులకు బాఘెల్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదని శుక్లా స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :