Tuesday, 10 March 2026 03:45:36 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

10th Paper Leak: పేపర్ లీక్ లో నా తప్పేమీ లేదు.. కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థిని

నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రాయితో కొడతానని బెదిరించి పేపర్ చూపించమన్నారని విద్యార్థిని వెల్లడి విద్యార్థిని డిబార్, అధికారులపై

Date : 24 March 2025 12:06 PM Views : 309

Studio18 News - తాజా వార్తలు / : నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ విద్యార్థినిని డిబార్ చేసిన అధికారులు.. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను విధుల నుంచి తప్పించారు. అయితే, పేపర్ లీక్ ఘటనలో తన తప్పేమీలేదని బాధిత విద్యార్థిని వాపోయింది. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చుని సమాధానాలు రాస్తుండగా ఇద్దరు యువకులు తనను బెదిరించారని ఆరోపించింది. ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామనడంతో తాను భయపడ్డానని, ఏంచేయాలో తోచక పేపర్ చూపించానని చెప్పింది. పేపర్ ను ఫొటో తీసుకుని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది. ఆ యువకులు ఎవరో కూడా తనకు తెలియదని, ఇందులో తన తప్పేమీ లేదని తెలిపింది. పరీక్ష రాయడానికి తనను అనుమతించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, శుక్రవారం నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయింది. గోడ దూకి పరీక్షాకేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై జవాబులు వెతికి, జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. దీనిపై ఎంఈవో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :