Tuesday, 10 March 2026 03:43:56 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Mallojula Venugopal: హిడ్మా ఎన్‌కౌంటర్ వేళ.. మావోయిస్టులకు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ పిలుపు

Date : 19 November 2025 07:33 PM Views : 113

Studio18 News - తాజా వార్తలు / : మావోయిస్టులు లొంగిపోవాలన్న మాజీ నేత వేణుగోపాల్ హిడ్మా సహా ఆరుగురి మృతిపై తీవ్ర విచారం మారిన పరిస్థితుల్లో సాయుధ పోరాటం సాధ్యం కాదని వెల్లడి రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి పోరాడాలని సూచన లొంగిపోయేవారు తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ విడుదల మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సాయుధ పోరాటం కొనసాగించడం సాధ్యం కాదు. దేశం మారుతోంది, పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్‌కౌంటర్లలో అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం" అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆయుధాలు వీడి ప్రజల్లోకి వచ్చి రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయాలని ఆయన మావోయిస్టులకు సూచించారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు తాను సహాయం చేస్తానని వేణుగోపాల్ హామీ ఇచ్చారు. అలాంటి వారు ఎవరైనా తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకోసం తన ఫోన్ నంబర్ 8856038533 ను ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని కోరారు. హిడ్మా వంటి కీలక నేతల మరణం ఉద్యమానికి తీరని లోటని, ఇకనైనా ప్రాణనష్టాన్ని ఆపాలని ఆయన అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :