Tuesday, 10 March 2026 03:47:43 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Vishnu Vs Manoj : మంచు విష్ణు ‘కన్నప్ప’కు పోటీగా మంచు మనోజ్ సినిమా.. అన్నదమ్ముల వార్.. బుల్లితెరపై కాదు వెండితెరపై చూసుకుందాం..

అన్న మంచు విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

Date : 25 March 2025 02:21 PM Views : 516

Studio18 News - తాజా వార్తలు / : Vishnu Vs Manoj : గత కొన్నాళ్లుగా మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు సాగుతున్నాయి. ఆస్తుల కోసం అని, విద్యాసంస్థల్లో జరుగుతున్న సమస్యల గురించి అని మోహన్ బాబు, మనోజ్ ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్ సినిమాలతో ముడిపడింది. మంచు విష్ణు కన్నప్ప సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది సినిమా. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు అన్న మంచు విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ గా భైరవం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లో వస్తాం అని ప్రకటించారు.

అయితే ఇటీవల మంచు మనోజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఉగాది ఈవెంట్ కి వెళ్లారు. దాని ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో యాంకర్ నందు భైరవం ఎప్పుడు రిలీజ్ అని మంచు మనోజ్ ని అడగ్గా.. ఏప్రిల్ లో వస్తున్నాం తమ్ముడు. చిన్న తెరల్లో కాదు ఈసారి వెండి తెరల్లో చూసుకుందాం అని డిసైడ్ అయ్యాను అని చెప్పాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :