Tuesday, 10 March 2026 03:44:17 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Manohar Lal Khattar: మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ.. హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి శుభవార్త

Date : 19 November 2025 07:38 PM Views : 78

Studio18 News - తాజా వార్తలు / : హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం, రాష్ట్రం 50:50 వాటా నగరంలో అదనంగా 160 కి.మీ. మెట్రో లైన్ల నిర్మాణంపై ప్రతిపాదనలు విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామన్న కేంద్రం మూసీ నది అభివృద్ధికి అమృత్ పథకం కింద నిధులు అమరావతి అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ భాగ్యనగర మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరించుకోవాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్‌లో అదనంగా 160 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రులు, అధికారుల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి ఖట్టర్ విలేకరులతో మాట్లాడారు. "మెట్రో విస్తరణ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఏ లైన్లకు ఆమోదం తెలపాలనే దానిపై మార్చి నాటికి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది" అని ఖట్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మెట్రోను విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. విశాఖ, విజయవాడ మెట్రోలు, అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా మెట్రో ప్రాజెక్టులకు డిమాండ్ ఉందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఆ ప్రతిపాదనలను కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని ప్రధాన నగరంగా అభివృద్ధి చేసే ఆలోచన కూడా కేంద్రానికి ఉందని, ప్రస్తుత ప్రణాళికల ఆధారంగా అవసరమైన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం చేయూత మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపైనా ఖట్టర్ మాట్లాడారు. "మొదటి దశలో 9 కిలోమీటర్ల మేర రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేస్తాం. నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. మూసీ ప్రక్షాళనకు అమృత్ పథకం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ద్వారా నిధులు సమకూరుస్తాం" అని వివరించారు. ఇదే సమయంలో, పట్టణాభివృద్ధికి కేటాయించిన నిధులను రాష్ట్రాలు సక్రమంగా ఎందుకు వినియోగించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మూసీ నది నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఆమోదం లభించిందని, హైదరాబాద్ మెట్రోకు 50:50 వాటా పద్ధతిపై చర్చలు జరిగాయని ధ్రువీకరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :