Wednesday, 30 April 2025 03:56:21 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌

క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్‌ 3 రోజులకు తగ్గిందన్నారు.

Date : 26 March 2025 10:57 AM Views : 119

Studio18 News - తాజా వార్తలు / : యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది మే లేదా జూన్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో ఈపీఎఫ్‌ నుంచి ఉద్యోగులు డబ్బులు తీసుకోవడం సులభతరం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి చేసిన ప్రతిపాదనలను లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్టీ ఆమోదించింది. ఈ విషయాన్ని లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ శాఖ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు.

ఏటీఎం ద్వారా ఉద్యోగులు రూ.లక్ష వరకు డబ్బును విత్‌‌డ్రా చేసుకోవచ్చని సుమిత చెప్పారు. అలాగే, బ్యాంక్ అకౌంట్లకు డబ్బు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. పీఎఫ్ నిధులు పొందే విషయంలో ఇకపై ఉద్యోగులు ఈ మార్పులను చూడబోతున్నారని చెప్పారు. డబ్బు విత్‌డ్రా మాత్రమే కాదు. ఉద్యోగులు తమ పీఎఫ్‌లో ఈ మేరకు డబ్బు ఉందో కూడా యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చని సుమితా చెప్పారు. ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో రూ.లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని అన్నారు. ఇటువంటి డిజిటలైజ్‌ విషయంలో ఈపీఎఫ్‌ఓ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. నగదు ఉపసంహరణ సౌకర్యాల క్రమబద్ధీకరణ కోసం 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేశారని సుమిత చెప్పారు. క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్‌ 3 రోజులకు తగ్గిందన్నారు. 95 % క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ విధానంలోనే జరుగుతున్నాయని అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నట్లు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :