Tuesday, 10 March 2026 03:46:54 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌

క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్‌ 3 రోజులకు తగ్గిందన్నారు.

Date : 26 March 2025 10:57 AM Views : 628

Studio18 News - తాజా వార్తలు / : యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది మే లేదా జూన్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో ఈపీఎఫ్‌ నుంచి ఉద్యోగులు డబ్బులు తీసుకోవడం సులభతరం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి చేసిన ప్రతిపాదనలను లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్టీ ఆమోదించింది. ఈ విషయాన్ని లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ శాఖ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు.

ఏటీఎం ద్వారా ఉద్యోగులు రూ.లక్ష వరకు డబ్బును విత్‌‌డ్రా చేసుకోవచ్చని సుమిత చెప్పారు. అలాగే, బ్యాంక్ అకౌంట్లకు డబ్బు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. పీఎఫ్ నిధులు పొందే విషయంలో ఇకపై ఉద్యోగులు ఈ మార్పులను చూడబోతున్నారని చెప్పారు. డబ్బు విత్‌డ్రా మాత్రమే కాదు. ఉద్యోగులు తమ పీఎఫ్‌లో ఈ మేరకు డబ్బు ఉందో కూడా యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చని సుమితా చెప్పారు. ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో రూ.లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని అన్నారు. ఇటువంటి డిజిటలైజ్‌ విషయంలో ఈపీఎఫ్‌ఓ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. నగదు ఉపసంహరణ సౌకర్యాల క్రమబద్ధీకరణ కోసం 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేశారని సుమిత చెప్పారు. క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్‌ 3 రోజులకు తగ్గిందన్నారు. 95 % క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ విధానంలోనే జరుగుతున్నాయని అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నట్లు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :