Tuesday, 10 March 2026 02:08:51 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Navaratri 2024 Day 5: కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహా చండీ దేవీ

Date : 07 October 2024 03:22 PM Views : 213

Studio18 News - భక్తి / : Navaratri 2024 : నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. చండీ దేవి అమ్మవారు ఒక్కోసారి శాంతంగా ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు. శాంతంగా.. దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరి దేవీ, జగన్మాత, భవాని అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అని పిలుస్తారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ఈరోజు ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. పసుపు రంగు పూవులతో పూజ చేస్తారు. చండీ, దుర్గా సప్తశతి చదివితే మంచిది. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. హరిద్వార్ లో ఉన్న చండీ దేవీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారని చెబుతారు. నవరాత్రుల్లో అష్టమి, నవమిలలో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల్లో శ్రీ మహా చండీ దేవిని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :