Tuesday, 10 March 2026 03:42:54 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Tirumala Garuda Seva: తిరుమలలో గరుడసేవ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 08 October 2024 10:50 AM Views : 202

Studio18 News - భక్తి / : Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఐదోరోజు కు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు మోహినీ అవతారంలో భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు గరుడ వాహనం సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడుడిపై గోవిందుడిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగు రోజుల నుంచి భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ఇవాళ గరుడ సేవ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచే తిరుమలకు భక్తులరాక పెరిగింది. మరోవైపు గరుడ సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లోకి రాలేని భక్తులు గరుడ సేవను తిలకించడానికి 28 భారీ హెచ్‌డీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. గ్యాలరీల్లోకి ప్రవేశం, నిష్క్రమణ సమయాల్లో తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా పటిష్టమైన బ్యారికేడ్లు, క్యూలైన్లను టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. తిరుమలలో దాదాపు 25 ప్రదేశాల్లో 9వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాలు నిండిపోతే వాహనాలను తిరుపతిలోనే ఆపేయనున్నారు. తిరుపతిలో అదనపు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు మాడవీధుల్లో మొబైల్ క్లీనిక్ లు, 12 అంబులెన్స్ లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండపై పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడువేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,750 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. గ్యాలరీల్లో దాదాపు రెండు లక్షల మంది కూర్చునే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగురోడ్డులో వేచిఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా అనుమతించి దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రాక్సీలకు అనుమతి నిలిపివేశారు. రాత్రి 9గంటల నుంచి ద్విచక్ర వాహనాలకు అనుమతి నిలిపివేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :