Monday, 15 December 2025 01:03:12 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Tirumala Prasadam: తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..

Date : 23 September 2024 03:16 PM Views : 172

Studio18 News - భక్తి / : Tirumala Prasadam: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజుల కాలంలోనే కాదు.. 1993లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తరువాతకూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్టగా క్రమ పద్దతిలో కొనసాగుతోంది. స్వామివారికి ప్రీతికరమైన లడ్డూ గురించి భక్తులకు సుపరిచితమే. అయితే, స్వామివారికి ఇంకొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. శ్రీ వేంకటేశ్వరుడు తన చూపుతో ఆ పదార్థాలన్నింటిని పవిత్రం చేసి, ఆస్వాదించి, తన భక్త శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ దివ్య ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తష్టీ, సంతుష్టీ కలుగుతాయి. దానితోపాటు ఎన్నో కోరికలు నెరవేరడంతోపాటు ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. స్వామివారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారంటే.. → స్వామివారికి ప్రతీరోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ మూడు సమయాల్లో ఉంటుంది. → ఉదయం 5.30 గంటలకు, ఉదయం 10గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఉంటుంది. వీటినే మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం, మూడో గంట నైవేద్యంగా పిలుస్తారు. → ఉదయం 5.30నిమిషాలకు (మొదటి గంట నైవేద్యం) సమర్పించే నివేదనలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం, మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఈ ప్రసాదాలనే బేడి ఆంజనేయస్వామితో పాటు ఇతర ఉపాలయాలకు పంపుతారు. → ఉదయం 10 గంటలకు (రెండో గంట నైవేద్యం) నివేదించే ప్రసాదాలలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సాకిరి బాత్ సమర్పిస్తారు. → రాత్రి 7.30 నిమిషాలకు (మూడో గంట నైవేద్యం) నివేదించే ప్రసాదాల్లో కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలు, లడ్డూలతో పాటు.. ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని శ్రీవారికి నివేదిస్తారు. → వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. → సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. → మంగళవారం సమర్పించే నైవేద్యంలో ప్రత్యేకంగా ‘మాత్ర ప్రసాదం’ ఉంటుంది. మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. → బుధవారం సమర్పించే ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పు సమర్పిస్తారు. → గురువారం సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే వాటితోపాటూ తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబీ, మురుకు, పాయసాలు నివేదిస్తారు. → శుక్రవారం శ్రీవారి అభిషేక సేవ జరుగుతుంది. ఈ కారణంగా ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. → శనివారం నివేదనలో కదంబం, చక్రపొంగళి, లడ్డూలు, వదలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి, సీర, సేకరాబాత్, కదంబం, మొలహోర, తోమాల దోశలు సమర్పిస్తారు. → ఏకదాశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను స్వామివారికి నివేదిస్తారు. → నెలరోజులపాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోశలను స్వామివారికి నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :