Tuesday, 10 March 2026 02:07:53 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

Ganesh Chaturthi 2024 : వినాయకుడి ముందే భక్తులు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? దీనికి పురాణాల్లో ఓ కథ ఉంది.

Date : 07 September 2024 11:37 AM Views : 315

Studio18 News - భక్తి / : Ganesh Chaturthi 2024 : దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కాలువుదీరి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ఇవాళ్టి నుంచి రాబోయే పదకొండు రోజులు దేశవ్యాప్తంగా వాడవాడల వినాయక నామస్మరణతో మారమోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పలు ప్రాంతాల్లో ఉదయం, పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో గణపయ్యను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు ను ప్రారంభిస్తారు. అయితే, మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడి ముందే గుంజీలు ఎందుకు తీస్తారనేది ఆసక్తికరమైన అంశం. దీనికి పురాణాల్లో ఓ కథ కూడా ఉంది. వినాయకుడి ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు. దీని పరమార్థం వేరే ఉంది. ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడట. హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా, బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడట. విష్ణువు వైకుంఠానికి వెళ్తూ సుదర్శన చక్రాన్ని వెతకగా.. గణపతి తాను మింగేశానని చెప్పాడు. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట. చివరకు మహావిష్ణువు కుడిచేత్తో ఎడమ చెవినీ, ఎడమ చేత్తో కుడి చెవినీ పట్టుకొని గుంజీలు తీశాడట. అదిచూసి గణపతి పడీపడీ నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు. నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. ఇలా చేయడం వల్ల మెదడూ చెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :