Tuesday, 10 March 2026 02:09:43 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Ganesh Chaturthi 2024 : మీరు ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టిస్తున్నారా? అయితే తప్పనిసరిగా ఇలా చేయండి..

Date : 07 September 2024 11:35 AM Views : 243

Studio18 News - భక్తి / : Ganesh Chaturthi 2024 : దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కాలువుదీరి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ఇవాళ్టి నుంచి రాబోయే పదకొండు రోజులు దేశవ్యాప్తంగా వాడవాడలా వినాయక నామస్మరణతో మారమోగనున్నాయి. అయితే, చాలా మంది భక్తులు తమ గృహాల్లో బుజ్జి గణపయ్యలను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచనలు చేస్తున్నారు. బొజ్జ గణపయ్యను ఇంట్లో ఏ దిక్కున కూర్చోబెట్టాలి.. గణనాథుడి వద్ద ఎలాంటి శుభ్రత పాటించాలి.. వంటి అంశాలను ఓసారి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడిని ఇంట్లో ప్రతిష్టించుకునే భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గణనాథుడ్ని ఎప్పుడూ ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గణనాథుడ్ని ప్రతిష్టించిన ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూసుకోవాలి. గణనాథుడ్ని ప్రతిష్టించే ముందు ఆ స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం మంచిది. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేయాలి. రోజుకు మూడు సార్లు పలు రకాల పిండి వంటలను గణపయ్యకు ఆహారాన్ని అందించాలి. గణనాథుడ్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో విగ్రహం పగలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. గణపయ్యకు ఎరుపు, మిశ్రమ రంగుల దుస్తులను ధరించండి. ఎరుపు రంగు పూలను కూడా అందించండి గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు. కాబట్టి గణేశుడి పూజకు మధ్యాహ్న సమయం మరింత అనుకూలంగా పరిగణించబడుతుంది. చవితి పూజలో వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రీ తప్పనిసరి. నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు, బావులు, నదుల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :