Studio18 News - భక్తి / : హిందూ మతంలో మార్గశిర మాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నెలలోనే శ్రీ రాముడు, సీతాదేవి వివాహం జరిగింది. అందుకే ఈ నెల మరింత ప్రత్యేకమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర శుక్ల పక్షం ఐదవ రోజును వివాహ పంచమి అని పిలుస్తారు. ఈ పర్వదినాన అరటి చెట్టును పూజిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజిస్తే వారి సమస్యలన్నీ దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడు వచ్చింది..? ఈ పర్వదినాన ఎలాంటి వేడుకలు జరుపుకుంటారు..? అరటి చెట్టును పూజించటం వల్ల కలిగే ఫలితాలేంటో ఇక్కడ చూద్దాం… 2025 వివాహ పంచమి తేదీ, ముహూర్తం: ఈ సంవత్సరం వివాహ పంచమి నవంబర్ 24న వచ్చింది. రాత్రి 9:22 గంటలకు ప్రారంభమై, నవంబర్ 25 రాత్రి 10:56 గంటలకు ముగుస్తుంది. పూజకు శుభ సమయం ఉదయం 7:07 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. కానీ, ఆ రోజు అంతా శుభ సమయంగా పరిగణిస్తారు.. ఈ శుభ సమయం అంటే పంచాంగాన్ని సంప్రదించకుండా లేదా గ్రహాలు, నక్షత్రాల గురించి చింతించకుండా వివాహాలను జరుపుకోవచ్చు. ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇది వివాహానికి శుభప్రదంగా పరిగణిస్తారు. రామాయణం ప్రకారం, జనక మహా రాజు ఈ తేదీన సీతారాముల కల్యాణం జరిపించాడని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున అత్యంత శుభప్రదమైన సమయంగా మారింది. మిథిలా ప్రాంతంలో వేలాది జంటలు ఈ రోజున ఆ సీతారాముల సాక్షిగా ఒక్కటవుతారు. అలాంటి వివాహాలు విభేదాలు లేకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం.
Admin
Studio18 News