Tuesday, 10 March 2026 02:09:43 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Vinayaka Chavithi 2024 : గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

Date : 07 September 2024 12:20 PM Views : 292

Studio18 News - భక్తి / : Vinayaka Chavithi 2024 : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణాలు, పల్లెల్లో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. ప్రజలు తమ ఇళ్లలో గణపథులను ప్రతిష్టించుకొని నిష్టతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా.. గణపతి పూజలో పాల్గొనవచ్చా.. అనే విషయంపై అనేకమందిలో సందేహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తుల సందేహాలను పండితులు నందిభట్ల శ్రీహరి శర్మ ఓ మీడియా ఛానెల్ డిబేట్ లో నివృతి చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. బహిష్టి సమయంలో ఉన్నటువంటి స్త్రీలు గణపతి పూజలో పాల్గొనవద్దు. పండుగ రోజున ఏ వస్తువులను తాకకుండా ఇంట్లో ఓ చోట కూర్చొని.. ఇంట్లో ఉన్న పెద్దవారి చేత.. పూజా విధానాన్ని చేయించవచ్చు. వినాయక చవితి రోజున, పూజ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్టి సమయంలో ఉన్న స్త్రీలు ఇంట్లో వస్తువులను తాకకూడదు. అదేవిధంగా ఏటి సూతకం (అంటు) లో ఉన్నవారు కూడా పూజలో పాల్గొనకూడదు. అయితే, ఇక్కడ ఓ విషయం ఉంది. బాబాయిలు, పెద్దనాన్నలు చనిపోయినప్పుడు.. ఆ సమయంలో వారి వంశస్తులందరికీ ఏటి సూతకం వర్తించదని నందిభట్ల శ్రీహరి శర్మ చెప్పారు. తండ్రి, తల్లి చనిపోయినట్లయితే వారి కుమారులు, కుమారుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది. వారు సంవత్సరం పాటు పండుగలు, నోములు, వ్రతాల్లో పాల్గొవద్దని శ్రీహరి శర్మ తెలిపారు. కొన్ని శాస్త్ర ప్రమాణాలు అనుసరించి గర్భిణీ స్త్రీలకు ఐదో నెల లేదా ఏడో నెల తగిలిన తరువాత పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వారి కుటుంబ సభ్యులు, పిల్లల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. పూజా కార్యక్రమాలను దగ్గరుండి చూడవచ్చు తప్పులేదు. పూజా కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనవద్దు. ఎందుకంటే.. కొన్ని మంత్రాలు ఉఛ్చరించాల్సి ఉంటుంది. ఆ మంత్రాల శబ్ధాల తరంగాలు గర్భంలోని శిశువుకు ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఉద్దేశంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. శాస్త్రాల ప్రకారం కుటుంబంలో ఐదు లేదా ఏడు నెలలు దాటిన గర్భిణీ స్త్రీ ఉన్నట్లయితే.. ఆమె భర్త కొబ్బరికాయ కొట్టకూడదు.. గుమ్మడికాయ కూడా కోయకూడదు.. ఈ నియమాలు మన శాస్త్రంలో చెప్పబడిందని శ్రీహరి శర్మ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :