Tuesday, 10 March 2026 02:10:12 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Sravana Masam 2024 : శ్రావణమాసం రెండో శుక్రవారం.. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

Date : 16 August 2024 01:38 PM Views : 414

Studio18 News - భక్తి / : Sravana Masam 2024 : తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం రెండవ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో తెల్లారుజామున 5గంటలకే అమ్మవారి పూజ ప్రారంభించారు. ఉదయం సువర్ణ వస్త్ర అలంకరణ పూర్తయింది. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 6గంటలకు వరలక్ష్మీ వ్రతంను ఆచరించారు. అష్టలక్ష్మీ ఆలయంలో మరో మూడు రోజులుపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సాయంకాలం నుండి ఉదయం వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మూడు రోజులపాటు అంకురార్పణ, హోమాలు.. పవిత్రారాధన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కొనసాగుతుంది. 11గంటలకు గోపూజ నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో తెల్లవారు జామున 5గంటలకే అమ్మవారి పూజ పార్రంభమైంది. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎంతో ప్రత్యేకం. దీంతో తెల్లవారు జాము నుంచే అమ్మవారి దర్శనంకోసం పెద్దెత్తున భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వనదుర్గమాతను తామర పుష్పాలతో ఆలయ అర్చకులు అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ఏడుపాయల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :