Tuesday, 10 March 2026 02:11:21 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

భక్తి శ్రద్దలతో నాగ పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

Date : 09 August 2024 03:32 PM Views : 229

Studio18 News - భక్తి / : Nag Panchami 2024 : తెలుగు రాష్ట్రాల్లో నాగ పంచమిని భక్తులు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. నాగ పంచమి సందర్భంగా పాముల పుట్టల వద్ద, శివాలయాల్లోనూ, సుబ్రహ్మణ్యస్వామి ఆయాలతో పాటు పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే భక్తులు స్నానాలు ఆచరించి నాగ పుట్టల వద్దవెళ్లి పూజలు నిర్వహించి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా తెల్లవారు జామునే భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిద్ధిపేట జిల్లాలోని గాడిచర్లపల్లి సంతాన నాగదేవత ఆలయంకు తెల్లవారు జామునుంచే భక్తులు తరలివచ్చారు. పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నాగ పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా హస్నాబాద్ లో నాగ పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాటుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రావణ మాస మొదటి శుక్రవారం కావడంతో నాగ పంచమి పురస్కరించుకొని చెన్నూర్ లోని అంబా అగస్తేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు.. ఆలయంలోని నాగ దేవత విగ్రహానికి పూజలు చేసి, పుట్టలో పాలుపోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ నాగదేవత ఆలయంలో నాగ పంచమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పుట్టల్లో పాలు పోసి భక్తులు మెక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతోపాటు నాగ పంచమి శుభ ముహూర్తం కావడంతో చిన్నారులకు అక్షర శ్రీకర చేయించి, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు వేచియున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :