Tuesday, 10 March 2026 02:12:44 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Vemulawada : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభం.. టికెట్‌ ధర ఎంతంటే?

Date : 05 August 2024 11:20 AM Views : 236

Studio18 News - భక్తి / : Vemulawada : దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో నిర్వహించే పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయ మహా మండపంలోని ఇత్తడి, వెండి తొడుగులను శుభ్రం చేశారు. ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. శ్రవణ మాసం మొదటి సోమవారం కావడంతో ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఇవాళ్టి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో బ్రేక్ దర్శనం ప్రారంభించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో వీఐపీ భక్తుల తాకిడితో సాధారణ భక్తులకు ఇబ్బంది కాకుండా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఒకరికి రూ. 300 టికెట్ ధరతో ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. బ్రేక్ దర్శనం కార్యక్రమంను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రావణ మాసంలో ఆలయంలో రోజూ స్వామివారికి తెల్లవారు జామున 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మంగళ వాయిధ్యాలు, సుప్రభాతం, సర్వదర్శనం, ఆలయ శుద్ధి, ప్రాత:కాల పూజలు నిర్వహించనున్నారు. మొదటి సోమవారం కావడంతో మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :