Studio18 News - భక్తి / : సనాతన ధర్మంలో మార్గశిర మాసం చాలా పవిత్రమైనదిగా పరిగిణిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేయడం అత్యంత శ్రేయోదాయకంగా భావిస్తారు. ఈ మార్గశిర అమావాస్య రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శ్రీహరి పూజతో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే, పూర్వీకులను పూచించటం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని, పితృ శాపాలు తొలగిపోతాయని చెబుతారు. వేద క్యాలెండర్ ప్రకారం, మార్గశీర అమావాస్య నవంబర్ 19న ఉదయం 9:43 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు నవంబర్ 20న మధ్యాహ్నం 12:16 గంటలకు ముగుస్తుంది. దీని ప్రకారం, మార్గశీర అమావాస్య నవంబర్ 20న జరుపుకుంటారు. మార్గశిర అమావాస్య రోజున పవిత్ర నదులు, తీర్థయాత్ర ప్రదేశాలలో పవిత్ర స్నానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. స్నానం తర్వాత దానధర్మాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజున ఆహారం, దుస్తులు, నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. అయితే, 12రాశుల ప్రకారం ఏ రాశి వారు ఎలాంటివి ధానం చేయటం వల్ల శుభఫలితాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం…
Admin
Studio18 News