Studio18 News - ఆరోగ్యం / : శుద్ధి చేసిన చక్కెర: కూల్ డ్రింక్స్, డెజర్ట్లు, సాస్లు, ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉండే ఈ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇది రక్త నాళాలలో వాపును పెంచి, నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేసే ఎండోథెలియం అనే పొరను దెబ్బతీస్తుంది. 1 / 6 పిండి పదార్థాలు: తెల్ల రొట్టె, క్రాకర్లు, పేస్ట్రీలలో ఉండే శుద్ధి చేసిన పిండి కూడా శరీరంలో చక్కెరలాగే పనిచేస్తుంది. ఇది కూడా రక్తంలో చక్కెరను పెంచి, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో తృణధాన్యాలలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఏవీ ఉండవు. ఇది రక్త నాళాలకు మరింత హాని చేస్తుంది. ఇది ఎండోథెలియల్ పనితీరుకు నష్టం కలిగించడంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 2 / 6 నూనెలు: సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల వంటి పారిశ్రామిక నూనెలలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వేడి చేసినప్పుడు అవి విషపూరిత సమ్మేళనాలుగా మారి గుండెకు ప్రమాదం కలిగిస్తాయి. 3 / 6 ధూమపానం: ధూమపానం గుండెకు ప్రమాదకరమని అందరికీ తెలుసు. పొగాకు పొగలోని రసాయనాలు నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేసే ఎంజైమ్లను నాశనం చేస్తాయి. దీంతో శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు బాగా పడిపోతాయి. 4 / 6 మౌత్వాష్: నోటి పరిశుభ్రత కోసం వాడే యాంటీబ్యాక్టీరియల్ మౌత్వాష్లు నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఈ బ్యాక్టీరియా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అది లేకపోతే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గి, రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. 5 / 6 నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచడానికి పాలకూర, బీట్రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, దానిమ్మ, డార్క్ చాక్లెట్ వంటివి ఎక్కువగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం,ధ్యానం చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. 6 / 6
Admin
Studio18 News