
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులో చేరిన వాళ్లు.. కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు.
వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకొని, కాసేపు అటూఇటూ తిప్పారు. అనంతరం కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొని పంజాగుట్ట వద్ద దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపిన పృథ్వీ.. శనివారం రాత్రి పంజాగుట్ట పీఎస్లో కేసు పెట్టారు.
Follow us on Social Media