విజయసాయి ఫోన్ పోయిందా? లేక జగన్ లాక్కున్నారా?: టీడీపీ నేత జవహర్

Spread the love
  • విజయసాయి ఫోన్ పోయిందంటూ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు
  • లిక్కర్ స్కామ్ సమాచారమంతా అందులో ఉందన్న జవహర్
  • అందుకే ఫోన్ దాచేశారని విమర్శ
Jawahar comments on Vijayasai Reddy phone missing
ఫోన్ పోయిందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సమాచారమంతా ఆ ఫోన్ లో ఉందని… అందుకే ఫోన్ పోయిందని డ్రామా చేస్తున్నారని అన్నారు. ఈడీ విచారణలో ఈ ఫోన్ ను పరిశీలిస్తే మొత్తం సమాచారం బయటపడుతుందని… అందుకే దాన్ని దాచేశారని చెప్పారు.

అలాగే విశాఖ రుషికొండ వాటాల సమాచారం కూడా అందులో ఉందని అన్నారు. తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తన ఫోన్ పోయిందని విజయసాయి అంటున్నారని దుయ్యబట్టారు. విజయసాయి ఫోన్ నిజంగా పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అని ప్రశ్నించారు. మరోవైపు, విజయసాయికి చెందిన ఐఫోన్ 12ప్రో ఫోన్ పోయిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com