- 2025-26 ఆర్థిక సంవత్సరంలో 23.4 లక్షల కార్లు ఉత్పత్తి చేసిన మారుతి
- ప్రతి 14 నిమిషాలకు ఒక కారు తయారు చేసి కొత్త రికార్డు
- భారత్లో ఏ ఆటోమొబైల్ కంపెనీ సాధించని అత్యధిక ఉత్పత్తి ఇది
- ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యమన్న ఎండీ
ఈ ఆర్థిక సంవత్సరంలో డిజైర్, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా, బాలెనో మోడల్స్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యాయి. ఈ ఐదు మోడళ్లలో ప్రతి ఒక్కటీ 2 లక్షలకు పైగా యూనిట్లుగా తయారయ్యాయి. సుజుకి మోటార్ కార్పొరేషన్కు చెందిన ప్రపంచవ్యాప్త తయారీ కేంద్రాలలో కూడా ఈ స్థాయి ఉత్పత్తిని సాధించిన ఏకైక కంపెనీగా మారుతి సుజుకి నిలిచింది.
ఈ అపూర్వ విజయంపై మారుతి సుజుకి ఎండీ, సీఈఓ హిసాషి తకేయుచి స్పందించారు. “ఒకే దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు తయారు చేయడం గర్వకారణం. నాలుగున్నర దశాబ్దాలుగా మేం నిర్మించిన ఆటోమొబైల్ పర్యావరణ వ్యవస్థ, మా ఉద్యోగులు, భాగస్వాముల సమష్టి కృషి, ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ 2.0 వంటి విధానాల వల్లే ఇది సాధ్యమైంది” అని ఆయన వివరించారు.
భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 40 లక్షల యూనిట్లకు పెంచాలని, భారతదేశాన్ని కీలకమైన ఎగుమతి హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తకేయుచి తెలిపారు. ఈ విజయం మారుతి సుజుకి పటిష్ఠమైన సరఫరా వ్యవస్థ, డీలర్ నెట్వర్క్కు నిదర్శనంగా నిలుస్తోంది.




