Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త మీనన్తో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక నగల దుకాణాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఏలూరులో జరిగిన నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, తన రాబోయే చిత్రం ‘అఖండ 2’ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, చాలా బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నటి సంయుక్త మీనన్, బాలయ్య పట్ల గౌరవపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా.. సంయుక్త వెనుక నుంచి వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. ఈ అనూహ్య పరిణామానికి బాలకృష్ణ క్షణకాలం ఆశ్చర్యపోయినప్పటికీ, వెంటనే తేరుకుని ఆమెను "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. https://x.com/BalayyaUvasena/status/1933570115356017151?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1933570115356017151%7Ctwgr%5Ebedb3f5f158169df4981e3a8d8b446564fc62029%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F832545%2Fnandamuri-balakrishna-blesses-samyuktha-menon-after-she-touches-his-feet
Admin
Studio18 News