Sunday, 08 March 2026 04:49:10 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

8 కోట్లతో సినిమా .. 80 కోట్లకి పైగా వసూళ్లు!

Date : 11 June 2025 05:52 PM Views : 594

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో క్రితం ఏడాది ఆరంభంలో వచ్చిన 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' .. 'భ్రమయుగం' సినిమాలు వెంటవెంటనే భారీ విజయాలను అందించాయి. తక్కువ బడ్జెట్ తో 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలు రికార్డులను సృష్టిస్తే, తక్కువ పాత్రలతో 'భ్రమయుగం' సంచలనం సృష్టించింది. ఈ ఏడాది కూడా మళయాలంలో అదే జోరు కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తమిళ సినిమాలు కూడా ఇదే తరహా కంటెంట్ ను అందించడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. ఆ జాబితాలో మనకి 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఒకటిగా కనిపిస్తోంది. శశికుమార్ .. సిమ్రన్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథలో, శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో ధర్మదాసు ఫ్యామిలీ బ్రతకడం కోసం భారత్ లోకి ప్రవేశిస్తుంది. తాము ఎక్కడి నుంచి వచ్చింది బయటికి చెప్పకుండా, చుట్టుపక్కలవారి నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందనేది కథ. వినోదం - సందేశం కలిసి నడిచే ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :